వాల్య తండ గ్రామ పంచాయితీ సర్పంచ్ నాగ నాయక్.

మరిపెడ,జులై 15(నమస్తే న్యూస్).ఎల్ నీనో ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాల్య తండా గ్రామ సర్పంచ్ నాగ నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం మరిపెడ మండలం,తానంచర్ల క్లస్టర్ పరిధిలోని వాల్య తండా గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితులలో ప్రత్యామ్నాయ మరియు పంట మార్పిడి పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ నాగ నాయక్ మాట్లాడుతూ,ఈసారి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.జొన్న,సజ్జ,రాగులు,మొక్కజొన్న వంటి పంటలు కరువును తట్టుకుంటాయి.వీటివల్ల పెట్టుబడి తక్కువ,దిగుబడి మెరుగ్గా ఉంటుంది.ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటించి పంట మార్పిడి చేస్తే రైతుకు నష్టం ఉండదని అన్నారు.ఈ సదస్సులో ఏఈఓ అన్వేష్ రైతులకు పంటల సాగు పద్ధతులు,విత్తనాల ఎంపిక గురించి వివరించారు.ఇరిగేషన్ ఏఈ సింధు నీటి వినియోగం,చుక్క నీటి పారుదల ప్రాముఖ్యతను తెలిపారు.కార్యక్రమంలో గ్రామ రైతులు,స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల సూచనలను అడిగి తెలుసుకున్నారు.

