◆మృతుని కుటుంబానికి అర్ధిక సహాయం అందజేత.
(నమస్తే మానుకోటదంతాలపల్లి)
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటామనే బరోసా వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుందని సామాజిక సేవకుడు సేను రాజేష్ అన్నారు. మన వంతుగా మన పరిసరప్రాంతంలో ఉన్న కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన జటంగి యాకయ్య (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం యాకయ్య దశదిన కర్మ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన సామాజిక విద్యావ్యత సేను రాజేష్ మృతుని కుటుంబానికి రు.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి,ప్రగాఢ సానుభూతిని తెలిపి, కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ఆయన వెంట మార్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
