- కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మహాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్.సత్యనారాయణ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ(జులై 04)నమస్తే న్యూస్.
తానంచెర్ల గ్రామానికి చెందిన కీ.శే.కోడూరు కృష్ణారెడ్డి భార్య సులోచన అనారోగ్య కారణాలవల్ల ఇటీవల మరణించింది. విషయం తెలుసుకున్న మహబూబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామసహాయం సత్యనారాయణ రెడ్డి,వారితో పాటుగా రామసహాయం అజిత్ రెడ్డి ఖమ్మం జిల్లా కొర్లగూడెం గ్రామంలోని వారి గృహానికి వెల్లి పరామర్శించారు.సులోచన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుమారుడు కోడూరు శ్రీనివాస రెడ్డి మరియు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.ఎలా మరణించారని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీత అంజి,భగవంత్ చారి తదితరులు పాల్గొన్నారు.
